యాప్నగరం

ఈడెన్ గార్డెన్స్‌లో గంగూలీకి అరుదైన గౌరవం

ఇంగ్లండ్‌తో మూడో వన్డే జరుగుతున్న వేళ.. ఈడెన్ గార్డెన్స్‌లో గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది.

TNN 22 Jan 2017, 4:25 pm
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అరుదైన ఘనత దక్కింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలోని ఓ స్టాండ్‌కు గంగూలీ పేరు పెట్టారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే సందర్భంగా గంగూలీ పేరుతో ఈ స్టాండ్‌ను ప్రారంభిస్తారు. జగన్మోహన్ దాల్మియా, బీఎన్ దత్, పంకజ్ రాయ్‌ల పేర్లతోనూ ఆదివారం మరో మూడు స్టాండ్లను ప్రారంభించారు. తర్వాత మరో నాలుగు స్టాండ్లను ప్రారంభిస్తారు. వీటికి ఏఎన్ ఘోష్, జేసీ ముఖర్జీ, ఇద్దరు ఆర్మీ అధికారుల పేర్లు పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గంగూలీ తెలిపాడు.
Samayam Telugu india vs england 3rd odi eden gardens stand named after sourav ganguly
ఈడెన్ గార్డెన్స్‌లో గంగూలీకి అరుదైన గౌరవం


ఈడెన్స్‌లో స్టాండ్‌కు తన పేరు పెట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని దాదా చెప్పాడు. తన పేరును క్యాబ్ మాజీ కార్యదర్శి బిస్వరూప్ ప్రతిపాదించారని గంగూలీ తెలిపాడు. ఆర్మీ అధికారుల పేర్లను స్టాండ్స్‌కు పెట్టాలనే ప్రతిపాదనకు సైన్యం అనుమతి ఇచ్చిందని, 2009లో దాల్మియా కూడా ఈ మేరకు సైన్యాన్ని కోరారని బెంగాల్ దాదా తెలిపాడు.

ఇప్పటికే ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండుల్కర్ పేరిట స్టాండ్ ఉండగా, హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఓ స్టాండ్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.