యాప్నగరం

ఇంగ్లాండ్‌ను 161కే చుట్టేసిన భారత్

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజు

Samayam Telugu 19 Aug 2018, 9:13 pm
ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజు బ్యాట్స్‌మెన్స్‌ సత్తాచాటగా.. రెండో రోజు బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో.. ఇంగ్లాండ్ జట్టు‌ని తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా 168 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 5/28తో మెరవగా.. బుమ్రా, ఇషాంత్ చెరో రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఈరోజు ఆరంభ సెషన్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
Samayam Telugu india vs england 3rd test day 2 pandya fiver helps india bundle out england for 161
ఇంగ్లాండ్‌ను 161కే చుట్టేసిన భారత్


ఓపెనర్లు అలిస్టర్ కుక్ (29), జెన్నింగ్స్ (20) తొలి వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ సాఫీగా మొదలైంది. కానీ.. లయ అందుకున్న భారత బౌలర్లు చెలరేగడంతో.. అదే ఇంగ్లాండ్ జట్టు పేకమేడని తలపిస్తూ పెవిలియన్‌కి క్యూ కట్టింది. జట్టు స్కోరు 54 వద్దే వరుసగా ఓపెనర్లు ఔటవగా.. అనంతరం జో రూట్ (16), పోప్ (10), బెయిర్‌స్టో (15), బెన్‌స్టోక్స్ (10), క్రిస్‌వోక్స్ (8), ఆదిల్ రషీద్ (5), స్టువర్ట్ బ్రాడ్ (0) భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. అయితే.. ఆఖర్లో జోస్ బట్లర్ (39: 32 బంతుల్లో 3x4, 2x6) కాసేపు దూకుడుగా ఆడినా.. అతని జోరుకి బుమ్రా కళ్లెం వేసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కి తెరదించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.