యాప్నగరం

భారత్ 352/7 డిక్లేర్... ఇంగ్లాండ్ టార్గెట్ 521

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి విజయానికి భారత్ జట్టు భారీ స్కోరుతో బాటలు వేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో

Samayam Telugu 20 Aug 2018, 10:35 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి విజయానికి భారత్ జట్టు భారీ స్కోరుతో బాటలు వేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో.. మూడో రోజైన సోమవారం ఓవర్‌ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (103: 197 బంతుల్లో 10x4) శతకం బాదగా, పుజారా (72: 208 బంతుల్లో 9x4), హార్దిక్ పాండ్య (52: 52 బంతుల్లో 7x4, 1x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడేశారు. దీంతో.. జట్టు 352/7తో నిలిచిన దశలో కెప్టెన్ కోహ్లి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కి 168 పరుగుల ఆధిక్యం లభించిన నేపథ్యంలో.. 521 పరుగుల భారీ లక్ష్యం ఇంగ్లాండ్‌ ముందు నిలిచింది.
Samayam Telugu England v India - Third Test
Cricket - England v India - Third Test - Trent Bridge, Nottingham, Britain - August 20, 2018 India's Virat Kohli declares Action Images via Reuters/Paul Childs


జట్టు స్కోరు 224 వద్ద తొలుత పుజారా ఔటవగా.. అనంతరం శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి 281 పరుగుల ఔటయ్యాడు. దీంతో.. భారత్ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు. కానీ.. జట్టు స్కోరు 500+ చేరుకునే వరకూ వేచి చూసిన కోహ్లి.. ఆ తర్వాత హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడుతుండటంతో.. అతని అర్ధశతకం పూర్తి అయిన తర్వాత డిక్లేర్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.