భారత్, ఇంగ్లాండ్ మధ్య కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఈరోజు ఆట ముగిసింది. మ్యాచ్లో రెండో రోజైన శుక్రవారం ఓవర్నైట్ స్కోరు 53/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్ని 290 పరుగులకి ఆలౌట్ చేసిన భారత్.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 43/0తో నిలిచింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (20 బ్యాటింగ్: 56 బంతుల్లో 2x4), కేఎల్ రాహుల్ (22 బ్యాటింగ్: 41 బంతుల్లో 4x4) ఉండగా.. భారత్ ఇంకా 56 పరుగులు వెనకబడి ఉంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టీమ్లో ఈరోజు ఓలీ పోప్ (81: 159 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. ఇన్నింగ్స్ చివర్లో క్రిస్వోక్స్ (50: 60 బంతుల్లో 11x4) వన్డే తరహా హిట్టింగ్తో చెలరేగిపోయాడు. దాంతో.. ఇంగ్లాండ్ టీమ్కి 99 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. ఓలీ పోప్ కంటే భారత్ జట్టుకి క్రిస్వోక్స్ హిట్టింగ్ ఈరోజు చివర్లో ఎక్కువ నష్టం చేసింది.
మ్యాచ్లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా.. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఆఫ్ స్టంప్ అవల వెళ్లే బంతుల్ని వెంటాడి తొలి ఇన్నింగ్స్లో వికెట్లు చేజార్చుకున్న భారత్ టాప్ ఆర్డర్.. శనివారం ఏ మేరకు ఆ బలహీనతని దిద్దుకుంటుందో..? చూడాలి.
మ్యాచ్లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా.. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఆఫ్ స్టంప్ అవల వెళ్లే బంతుల్ని వెంటాడి తొలి ఇన్నింగ్స్లో వికెట్లు చేజార్చుకున్న భారత్ టాప్ ఆర్డర్.. శనివారం ఏ మేరకు ఆ బలహీనతని దిద్దుకుంటుందో..? చూడాలి.