యాప్నగరం

భారత్ భారీ స్కోరు: చెలరేగిన ‘వి’ ద్వయం

ఇంగ్లండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ దీటైన జవాబిస్తోంది.

TNN 10 Dec 2016, 5:12 pm
ఇంగ్లండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ దీటైన జవాబిస్తోంది. 146/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. సెంచరీ వీరుడు విరాట్ కోహ్లి (147), జయంత్ యాదవ్ (30) క్రీజులో ఉన్నారు.
Samayam Telugu india vs england 4th test mumbai kohli ton gives india the lead
భారత్ భారీ స్కోరు: చెలరేగిన ‘వి’ ద్వయం


మూడో రోజు ఆటలో తొలి ఓవర్ రెండో బంతికే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ పుజారా (47) ఔటయ్యాడు. ఆ తరవాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మురళీ విజయ్ (136) ఇంగ్లండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. చెలరేగిన ఆడిన ఈ ‘వి’ ద్వయం మూడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో మురళీ విజయ్ సెంచరీ కూడా పూర్తిచేశాడు. నిలకడగా ఆడుతున్న విజయ్‌ని అదిల్ రషీద్ పెవిలియన్‌కు పంపాడు.

తరవాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నుంచి సరైన సహకారం లేనప్పటికీ ఎంతో పరిణతితో ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి స్కోరు బోర్డును నడిపించాడు. మరోవైపు కరుణ్ నాయర్ (13), పార్థివ్ పటేల్ (15), రవిచంద్రన్ అశ్విన్ (0), రవీంద్ర జడేజా (25) క్యూ కట్టారు. అయితే యువ ఆటగాడు జయంత్ యాదవ్ (30 నాటౌట్) కోహ్లికి జతకలిసాడు. మూడో రోజు మరో వికెట్ పడకుండా వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగుల లీడ్‌లో ఉంది.

ఇక రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో నాలుగో టెస్టు డ్రా దిశగా పయనించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.