యాప్నగరం

ఐదో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లాండ్

ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత జట్టులో రవీంద్ర జడేజా (86 నాటౌట్: 156 బంతుల్లో 11x4, 1x6),

Samayam Telugu 9 Sep 2018, 10:37 pm
భారత్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు మెరుగైన స్కోరుతో పట్టు బిగిస్తోంది. ఆటలో మూడో రోజైన ఆదివారం భారత జట్టుని 292 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు.. ఈరోజు కడపటి వార్తలందేసరికి 88/2తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. క్రీజులో అలిస్టర్ కుక్ (40), కెప్టెన్ జో రూట్ (13) ఉండగా.. ప్రస్తుత ఆధిక్యం 128 పరుగులు. ఇంగ్లాండ్ జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.
Samayam Telugu india vs england 5th test day 3 cook root extend england lead
ఐదో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లాండ్


ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత జట్టులో రవీంద్ర జడేజా (86 నాటౌట్: 156 బంతుల్లో 11x4, 1x6), అరంగేట్రం బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (56: 124 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఒకానొక దశలో 160/6తో నిలిచిన టీమిండియా ఈ ఇద్దరి పోరాటం కారణంగా 292 పరుగులైనా చేయగలిగింది. కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్న విహారి.. జట్టు స్కోరు 237 వద్ద ఔటవగా.. అనంతరం వచ్చిన ఇషాంత్ శర్మ (4), మహ్మద్ షమీ (1), జస్‌ప్రీత్ బుమ్రా (0)తో కలిసి జడేజా దూకుడుగా ఆడి భారత్‌ని మళ్లీ మ్యాచ్‌లో నిలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.