యాప్నగరం

జడేజా ఒంటరి పోరాటం.. భారత్ 240/7

ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న హనుమ విహారి.. ఆఫ్ సైడ్ కళాత్మక షాట్లతో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ.. హాఫ్ సెంచరీ తర్వాత స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో

Samayam Telugu 9 Sep 2018, 5:58 pm
ఇంగ్లాండ్‌తో ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. ఆటలో మూడో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 174/6తో మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించి భారత జట్టులో హనుమ విహారి (56: 124 బంతుల్లో 7x4, 1x6), రవీంద్ర జడేజా (41 బ్యాటింగ్: 94 బంతుల్లో 6x4) మెరుగ్గా రాణించడంతో లంచ్ విరామ సమయానికి టీమిండియా 240/7తో నిలిచింది. జట్టు స్కోరు 237 వద్ద విహారి ఔటవగా.. ప్రస్తుతం జడేజాతో పాటు ఇషాంత్ శర్మ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత జట్టు ఇంకా 92 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
Samayam Telugu Jadeja


వ్యక్తిగత స్కోరు 25 పరుగుల వద్ద ఈరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హనుమ విహారి 104 బంతుల్లో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఈ ఆంధ్రా క్రికెటర్‌‌కి ఇదే అరంగేట్రం టెస్టు కాగా.. కెరీర్‌లో భారత్ తరఫున ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న హనుమ విహారి.. ఆఫ్ సైడ్ కళాత్మక షాట్లతో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ.. హాఫ్ సెంచరీ తర్వాత స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడి డిఫెన్స్ చేసే ప్రయత్నంలో వికెట్ కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.