ఇంగ్లాండ్ పర్యటనని ఓటమితో ముగించిన భారత్
భారత్ జట్టు ఒకానొక దశలో 121/5తో ఘోర పరాజయం చవిచూసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జోడి ఆరో వికెట్కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు రేపింది.
Samayam Telugu 11 Sep 2018, 10:21 pm
ఇంగ్లాండ్ పర్యటనని భారత్ జట్టు ఓటమితో ముగించింది. ఓవల్ వేదికగా మంగళవారం ముగిసిన ఐదో టెస్టులో 464 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టులో లోకేశ్ రాహుల్ (149: 224 బంతుల్లో 20x4, 1x6), రిషబ్ పంత్ (114: 146 బంతుల్లో 15x4, 4x6) శతకాలతో మెరిసినా.. మిగతా బ్యాట్స్మెన్ ఫెయిలవడంతో జట్టుకి 118 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. తాజా విజయంతో ఐదు టెస్టుల ఈ సిరీస్ని ఇంగ్లాండ్ జట్టు 4-1తో చేజిక్కించుకుంది.
ఆటలో ఐదో రోజైన మంగళవారం ఓవర్నైట్ స్కోరు 58/3తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ జట్టు ఒకానొక దశలో 121/5తో ఘోర పరాజయం చవిచూసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జోడి ఆరో వికెట్కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు రేపింది. అయితే.. జట్టు స్కోరు 325 వద్ద రాహుల్ ఔటవగా.. 328 వద్ద పంత్ వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లాండ్వైపు మొగ్గింది. చివర్లో జడేజా (13), ఇషాంత్ (5) కాసేపు క్రీజులోనిలిచినా.. జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారంతే. ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్కి కెరీర్లో ఇదే చివరి టెస్టుకాగా.. ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి ఈ టెస్టుతో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు.
ఈ టెస్టు మ్యాచ్ స్కోరు బోర్డు కోసం క్లిక్ చేయండి.
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 332 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 292 పరుగులకి కుప్పకూలింది. దీంతో.. ఇంగ్లాండ్కి 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ను ఆ జట్టు 423/8 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్ నిలవగా.. టీమిండియా 345కే పరిమితమైంది.
ఆటలో ఐదో రోజైన మంగళవారం ఓవర్నైట్ స్కోరు 58/3తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ జట్టు ఒకానొక దశలో 121/5తో ఘోర పరాజయం చవిచూసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జోడి ఆరో వికెట్కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు రేపింది. అయితే.. జట్టు స్కోరు 325 వద్ద రాహుల్ ఔటవగా.. 328 వద్ద పంత్ వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లాండ్వైపు మొగ్గింది. చివర్లో జడేజా (13), ఇషాంత్ (5) కాసేపు క్రీజులోనిలిచినా.. జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారంతే. ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్కి కెరీర్లో ఇదే చివరి టెస్టుకాగా.. ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి ఈ టెస్టుతో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు.
ఈ టెస్టు మ్యాచ్ స్కోరు బోర్డు కోసం క్లిక్ చేయండి.
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 332 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 292 పరుగులకి కుప్పకూలింది. దీంతో.. ఇంగ్లాండ్కి 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ను ఆ జట్టు 423/8 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్ నిలవగా.. టీమిండియా 345కే పరిమితమైంది.