యాప్నగరం

ఇంగ్లాండ్‌పై తెలుగు క్రికెటర్ విహారి అర్ధశతకం

ఆటలో మూడో రోజైన ఆదివారం 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను జడేజాతో కలిసి కొనసాగించిన హనుమ విహారి 104 బంతుల్లో 6x4, 1x6 సాయంతో..!

Samayam Telugu 9 Sep 2018, 5:10 pm
ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి అర్ధ శతకంతో సత్తాచాటాడు. ఆటలో మూడో రోజైన ఆదివారం 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను జడేజాతో కలిసి కొనసాగించిన హనుమ విహారి 104 బంతుల్లో 6x4, 1x6 సాయంతో కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. భారత టెస్టు జట్టుకి ఎంపికైన మూడో ఆంధ్రా క్రికెటర్‌గా ఇటీవల రికార్డుల్లో నిలిచిన హనుమ విహారికి కెరీర్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
Samayam Telugu London : Indias Hanuma Vihari hits a shot during the fifth cricket test match o...
India's Hanuma Vihari hits a shot during the fifth cricket test match of a five match series between England and India at the Oval cricket ground in London. AP/PTI


హనుమ విహారి జోరుతో ఓవర్‌నైట్ స్కోరు 174/6తో ఈరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు 73 ఓవర్లు ముగిసే సమయానికి 224/6తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో విహారితో పాటు రవీంద్ర జడేజా (32: 78 బంతుల్లో 6x4) క్రీజులో ఉండగా.. ఈ జోడీ ఏడో వికెట్‌కి 64 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ నిన్న తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకి ఆలౌటవగా.. భారత్ ఇంకా 108 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.

టెస్టు జట్టులోకి మళ్లీ ఆంధ్ర క్రికెటర్ అరంగేట్రం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.