యాప్నగరం

మళ్లీ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి టి20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైంది.

TNN 1 Feb 2017, 7:09 pm
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి టి20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ భారత్‌కు వరుసగా మూడోసారి బ్యాటింగ్ అప్పగించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన మోర్గాన్ ఈ గేమ్‌లోనూ టాస్ గెలవడం విశేషం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Samayam Telugu india vs england bengaluru t20 live england won the toss and elected to field first
మళ్లీ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్


ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీం ఇండియా టి20 సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుని సగౌర్వంగా సొంతగడ్డకు వెళ్లాలని ఇంగ్లండ్ యోచిస్తోంది. మొత్తానికి ఈ మ్యాచ్‌ అభిమానుల్లో మంచి ఉత్కంఠను రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, టీం ఇండియాలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మనీస్ పాండే స్థానంలో రిషభ్ పంత్ జట్టులో చేరాడు. మరోవైపు రెండో టి20కి దూరమైన ఇంగ్లండ్ బౌలర్ ప్లంకెంట్ ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.