యాప్నగరం

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ

భారత ఆటగాడు కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరుగుతున్న ఆఖరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

TNN 19 Dec 2016, 5:03 pm
భారత ఆటగాడు కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరుగుతున్న ఆఖరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన నాయర్ అదే జట్టుపై 300 పరుగులు సాధించడం విశేషం. ఈ సిరీస్‌లో మూడు టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన నాయర్ కేవలం మూడు ఇన్నింగ్సుల్లో మాత్రమే బ్యాటింగ్ చేసాడు. కెరీర్‌లో తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన తొలి భారత క్రికెటర్‌గా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు.
Samayam Telugu india vs england chennai test karun nair scores triple century
కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ


వీరేంద్ర సెహ్వాగ్ తరవాత భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడినూ నాయర్ నిలిచాడు. నాలుగో రోజు ఉదయం సాధించిన సెంచరీని నాయర్ మధ్యాహ్నం డబుల్ సెంచరీగా.. సాయంత్రానికి ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కాని ట్రిపుల్ సెంచరీని కరుణ్ నాయర్ మూడో టెస్టులోనే సాధించడం గమనార్హం.

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ పూర్తికాగానే కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసాడు. 759/7 వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కరుణ్ నాయర్ 303 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లలో రవీంద్ర జడేజా (50) నాయర్‌కు మంచి సహకారాన్ని అందించాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల లీడ్‌ను సాధించింది. మరోవైపు ​ టెస్టుల్లో ఏ జట్టుపైనైనా భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.