యాప్నగరం

పెవిలియన్ చేరిన ఓపెనర్లు.. కష్టాల్లో భారత్

పుణే వన్డేలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. 351 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 24 పరుగులకే

TNN 15 Jan 2017, 6:36 pm
పుణే వన్డేలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. 351 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధవన్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ 8 పరుగులకే క్లీన్ బౌల్డయ్యాడు. వీరిద్దరినీ పెవిలియన్ చేర్చిన విల్లే ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఇంగ్లిష్ బౌలర్లు చక్కటి బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. భారత జట్టు 9.4 ఓవర్లలో 50 పరుగుల మార్కును చేరుకుంది.
Samayam Telugu 2 in 9 4 overs
పెవిలియన్ చేరిన ఓపెనర్లు.. కష్టాల్లో భారత్


మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి తనదైన స్టయిల్లో ఆడుతున్నాడు. అతడికి స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ సహకారం అందిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు 51 పరుగులు చేసింది. ఇండియా గెలవాలంటే మరో 40 ఓవర్లలో 308 పరుగులు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం యువీ 11 పరుగులతో, కోహ్లి 26 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ జట్టు టాస్ ఓడినప్పటికీ.. 350 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత గడ్డ మీద ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.