యాప్నగరం

కోహ్లి, కేదర్ అర్ధ శతకాలు.. కోలుకున్న భారత్

63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టును విరాట్; కేదార్ జాదవ్ ఆదుకున్నారు.

TNN 15 Jan 2017, 7:39 pm
పుణే వన్డేలో 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లి, స్థానిక ఆటగాడు కేదర్ జాదవ్ ఆదుకున్నారు. 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలో తడబడింది. 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న టీమిండియా తక్కువ వ్యవధిలోనే యువీ, ధోనీ వికెట్లను కోల్పోయింది. ధోనీ తాను ఎదుర్కొన్న ఆరో బంతికే వెనుదిరిగాడు. 2010లో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వెనుదిరిగిన ధోనీ.. మళ్లీ ఇప్పుడే తక్కువ బంతులాడి అవుటయ్యాడు. ధోనీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాదవ్.. కోహ్లికి అద్భుత సహకారం అందించాడు.
Samayam Telugu india vs england first odi live score kohli and jadhav scored half centuries
కోహ్లి, కేదర్ అర్ధ శతకాలు.. కోలుకున్న భారత్


పరిస్థితులకు అనుగుణంగా ఆడిన కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. వేగంగా పరుగులు రాబట్టిన జాదవ్ 29 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. గత 14 వన్డే ఇన్నింగ్స్‌లో ఇది కోహ్లికి పదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. విరాట్, జాదవ్ కలిసి సింగిల్స్ తీస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. వీరిద్దరూ రాణించడంతో 26 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.