యాప్నగరం

సెంచరీలతో కదం తొక్కిన కోహ్లి, కేదార్ జాదవ్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, కేదార్ జాదవ్ సెంచరీలతో సత్తా చాటారు.

TNN 15 Jan 2017, 8:32 pm
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, కేదార్ జాదవ్ సెంచరీలతో సత్తా చాటారు. 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. విరాట్ సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఇంగ్లండ్ ఫీల్డర్లు అడ్డుకున్నారు. మూడు బంతులను ఆడినప్పటికీ సింగిల్ తీయడం కుదరకపోవడంతో విరాట్ సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో విరాట్‌కు ఇది 27వ సెంచరీ కాగా.. ఛేజింగ్‌లో 17వది కావడం విశేషం. రెండోసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును విరాట్ సమం చేశాడు. మాస్టర్ 232 ఇన్నింగ్స్‌లలో 17 సెంచరీలు చేయగా.. కోహ్లి కేవలం 96 ఇన్నింగ్స్‌ల్లోనే మాస్టర్ రికార్డు సమం చేయడం విశేషం.
Samayam Telugu india vs england fist odi virat and jadhav make centuries
సెంచరీలతో కదం తొక్కిన కోహ్లి, కేదార్ జాదవ్


కష్టాల్లో ఉన్న జట్టును కోహ్లితో కలిసి జాదవ్ ఆదుకున్నాడు. విరాట్‌కు చక్కటి సహకారం అందిస్తూ.. బౌండరీలతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాదవ్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. భారత్ 35 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.