యాప్నగరం

ముంబై టెస్ట్.. టాస్ నెగ్గిన ఇంగ్లండ్

భారత్-ఇంగ్లండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ నెగ్గింది.

TNN 8 Dec 2016, 9:24 am
భారత్-ఇంగ్లండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై టెస్టు కోసం ఇంగ్లిష్ జట్టు రెండు మార్పులు చేసింది. గాయపడిన హసీబ్ స్థానంలో కీటన్‌ను తీసుకున్న ఇంగ్లండ్, బ్యాటీ స్థానంలో జేక్ బాల్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. ఇంతకు ముందు మూడు టెస్టులు జరిగిన వేదికలతో పోలిస్తే వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం కష్టమవుతుది. దీంతో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపింది.
Samayam Telugu india vs england fourth test live score england won the toss and opt to bat first
ముంబై టెస్ట్.. టాస్ నెగ్గిన ఇంగ్లండ్


ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే ఈ టెస్టులో ఆడటం లేదు. అతడి స్థానంలో మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. షమీ స్థానాన్ని భువనేశ్వర్ కుమార్‌తో భర్తీ చేశారు. గాయం నుంచి కోలుకున్న లోకేశ్ రాహుల్ కూడా ఈ టెస్టు ఆడుతున్నాడు.

భారత జట్టు: మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, పార్థీవ్ పటేల్ (కీపర్), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.