యాప్నగరం

జాసన్ రాయ్‌‌‌కు గండంలా మారిన జడేజా

ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్.. మూడు మ్యాచ్‌ల్లోనూ జడేజా చేతిలో అవుటయ్యాడు.

TNN 22 Jan 2017, 3:26 pm
వరుసగా మూడు వన్డేల్లో అర్ధ సెంచరీలు సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వాటిని సెంచరీలుగా మలవడంలో మాత్రం మూడుసార్లు విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రాయ్... పుణే వన్డేలో 73 రన్స్ చేశాడు. రెండో వన్డేలో 82 పరుగులు చేసిన రాయ్... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌‌ను ఆదుకున్నాడు. కోల్‌కతాలో జరిగిన మూడో వన్డేలోనూ 65 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో మరే ఇతర ఆటగాడు కూడా రాణించనంత నిలకడగా.. వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించిన జాసన్ రాయ్‌ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడానికి కారణం రవీంద్ర జడేజానే. ఈ మూడు మ్యాచ్‌ల్లో జడేజానే అతణ్ని అవుట్ చేయడం విశేషం. పుణే వన్డేలో 73 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన రాయ్‌ను ధోనీతో కలిసి బురిడీ కొట్టించి స్టంపౌట్‌గా పెవిలియన్ పంపిన జడ్డూ.. కటక్ వన్డేలో సెంచరీ దిశగా సాగుతున్న రాయ్‌ను బౌల్డ్ చేశాడు.
Samayam Telugu india vs england jason roy out for third time by jadeja in the series
జాసన్ రాయ్‌‌‌కు గండంలా మారిన జడేజా


రెండు వన్డేల్లో జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగి సెంచరీ అవకాశం మిస్సయిన రాయ్.. మూడో వన్డేలోనూ జడ్డూకే వికెట్ ఇచ్చుకున్నాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను కూడా జడ్డూ ఇలాగే ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

మూడు వన్డేల సిరీస్‌లో జాసన్ రాయ్ మూడు వరుస అర్ధ సెంచరీ సాయంతో 220 పరుగులు సాధించాడు. మరోవైపు ఈ సిరీస్‌లో భారత ఓపెనర్లు రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమై నిరాశపర్చారు. రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్ కలిపి చేసిన పరుగులు 25 మాత్రమే కావడం గమనార్హం.

కోల్‌కతా వన్డే విషయానికి వస్తే 28 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 28 రన్స్‌తో, కెప్టెన్ మోర్గాన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.