యాప్నగరం

అత్యధిక 50+ స్కోర్లతో రికార్డుల మోత

మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ 50+ స్కోర్లు 15 నమోదు కావడమే రికార్డు కాగా.. ఈ సిరీస్‌లో..

TNN 22 Jan 2017, 11:19 pm
మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటి వరకూ 50+ స్కోర్లు 15 నమోదు కావడమే రికార్డు కాగా.. భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ 17సార్లు అర్ధ సెంచరీలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు నమోదు చేశారు. గతంలో ఈ రికార్డు భారత్, విండీస్ జట్ల పేరిటఉండగా.. ఈడెన్‌లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ్యాచ్‌లో కోహ్లి అర్ధ సెంచరీ సాధించడంతో ఈ రికార్డు బద్దలైంది. విరాట్ అవుటైన తర్వాత.. యంగ్ గన్స్.. జాదవ్, హార్ధిక్ పాండ్య కూడా అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. 2013లో విండీస్, భారత్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో నమోదైన 50కి పైగా పరుగుల రికార్డు బద్దలైంది.
Samayam Telugu india vs england odi seires most number of 50 plus scores record created by two teams
అత్యధిక 50+ స్కోర్లతో రికార్డుల మోత


తొలి వన్డేలో 50కి పైగా పరుగులను ఐదుగురు బ్యాట్స్‌మెన్ నమోదు చేయగా.. రెండో వన్డేలో ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ 50 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి వన్డేలోనూ ఆరు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం. 50 కంటే ఎక్కువ పరుగులను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పదిసార్లు సాధించగా.. ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ మూడు అర్ధ సెంచరీలు సాధించడం గమనార్హం. భారత జట్టు తరఫున విరాట్, జాదవ్.. ఓ సెంచరీ, ఓ అర్ధసెంచరీ చొప్పున సాధించారు. యువీ, ధోనీ చెరో శతకం బాదగా... చివరి వన్డేలో పాండ్య అర్ధ సెంచరీ సాధించాడు.

#TeamIndia seal the series 2-1 and not surprisingly smiles galore at the Eden Gardens #INDvENG @Paytm pic.twitter.com/G6CZ2IsZRk — BCCI (@BCCI) January 22, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.