యాప్నగరం

మోర్గాన్ రనౌట్.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

TNN 19 Jan 2017, 10:02 pm
చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన కటక్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 382 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలుచుకున్న భారత్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అద్భుత శతకంతో ఇంగ్లండ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు. 49 ఓవర్లో బుమ్రా మోర్గాన్‌ను రనౌట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సొంత గడ్డమీద కోహ్లి ఇప్పటి వరకూ 7 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇండియా గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో జాసన్ రాయ్ 82 పరుగులు చేయగా.. జో రూట్ 54 పరుగులతో రాణించాడు.
Samayam Telugu india vs england second odi india won the match by 15 runs
మోర్గాన్ రనౌట్.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ


206 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ జట్టును మొయిన్ అలీ (43 బంతుల్లో 55), ఇయాన్ మోర్గాన్ (81 బంతుల్లో 102) ఆదుకున్నారు. విజయం కోసం చివరి దాకా పోరాడిన ఇంగ్లండ్‌ను మోర్గాన్ రనౌట్ దెబ్బతీసింది. 354 పరుగుల వద్ద మోర్గాన్ వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత బౌలర్లలో అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా.. భువి, జడేజాకు తలో వికెట్ దక్కింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 381 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 150 పరుగులు చేయగా, ధోనీ 134 రన్స్ చేశాడు. ఆరేళ్ల తర్వాత యువీకి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ధోనీ 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సొంత గడ్డ మీద అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.