యాప్నగరం

ఇంగ్లండ్ 236 ఆలౌట్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

మొహాలీ టెస్టులో భారత జట్టు విజయం దాదాపు ఖరారైనట్లే.. నాలుగో రోజు ఆటలో దాదాపు రెండు సెషన్లు మిగిలి ఉండగా, 103 పరుగుల స్వల్ప లక్ష్యం ఎదురుగా ఉంది.

TNN 29 Nov 2016, 1:50 pm
మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 417 పరుగుల భారీ స్కోరు సాధించడంతో మరో 103 పరుగులు చేస్తే చాలు టీమిండియాను ​ విజయం వరిస్తుంది. 78/4తో నాలుగో రజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ పక్క సహచరులంతా వెనుదిరుగుతున్నా.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్ 78 పరుగులతో రాణించాడు. 107 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోడంతో ఇంగ్లండ్ త్వరగానే ఆలౌట్ అవుతుందని భావించారు.
Samayam Telugu india vs england third test live score england all out for 236 runs in second innings
ఇంగ్లండ్ 236 ఆలౌట్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం


కానీ హసీబ్ హమీద్, రూట్ కలిసి పోరాడారు. గాయం కారణంగా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హసీబ్ హమీద్ 59 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లండ్ పతనం ఆలస్యమైంది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కగా, జయంత్ యాదవ్, జడేజా, షమీలకు తలో రెండు వికెట్లు దక్కాయి. దాదాపు రెండు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో నాలుగో రోజే భారత్ ఈ మ్యాచ్‌ను కైవశం చేసుకునే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.