మొహాలీలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన కర్ణాటక బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ భారత కోచ్ కుంబ్లేను అనుసరించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. కోహ్లితో వేగంగా పరిగెత్తే విషయంలో సమన్వయ లోపంగా కారణంగా నాయర్ బలయ్యాడు. రన్ కోసం పరిగెత్తి వెనక్కి వచ్చే క్రమంలో కరుణ్ క్రీజుకు కొద్ది దూరంలో ఉండగానే బట్లర్ బుల్లెట్ వేగంతో విసిరిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో నాయర్ రనౌట్గా వెనుదిరిగాడు.
ఇంతకూ కుంబ్లేకు నాయర్కు పోలికేంటి అంటే.. 1990లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే మాంచెస్టర్లో్ జరిగిన రెండో టెస్టులో తొలిసారి బ్యాటింగ్ చేశాడు. అరంగేట్ర మ్యాచ్లో రెండు పరుగులు చేసిన కుంబ్లే రనౌటయ్యాడు. ఎంత కర్ణాటక ఆటగాళ్లు అయితే మాత్రం ఇద్దరూ ఇలాగే అరంగేట్రంలో రనౌట్ కావాలా? అది కూడా ఇంగ్లండ్ మీదేనా?
మొహాలీ టెస్టులో భారత జట్టు 204 పరుగుల వద్ద కోహ్లి వికెట్ను కోల్పోయింది. 62 పరుగులు చేసిన కోహ్లి స్టోక్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఓటయ్యాడు. ప్రస్తుతం అశ్విన్, జడేజా క్రీజులో ఉన్నారు.
ఇంతకూ కుంబ్లేకు నాయర్కు పోలికేంటి అంటే.. 1990లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే మాంచెస్టర్లో్ జరిగిన రెండో టెస్టులో తొలిసారి బ్యాటింగ్ చేశాడు. అరంగేట్ర మ్యాచ్లో రెండు పరుగులు చేసిన కుంబ్లే రనౌటయ్యాడు. ఎంత కర్ణాటక ఆటగాళ్లు అయితే మాత్రం ఇద్దరూ ఇలాగే అరంగేట్రంలో రనౌట్ కావాలా? అది కూడా ఇంగ్లండ్ మీదేనా?
మొహాలీ టెస్టులో భారత జట్టు 204 పరుగుల వద్ద కోహ్లి వికెట్ను కోల్పోయింది. 62 పరుగులు చేసిన కోహ్లి స్టోక్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఓటయ్యాడు. ప్రస్తుతం అశ్విన్, జడేజా క్రీజులో ఉన్నారు.