యాప్నగరం

ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి.. రహానేకు అవకాశం

ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

TNN 22 Jan 2017, 1:22 pm
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రాత్రి పూట మంచు కురుస్తుండటంతో.. బౌలింగ్ చేయడం ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉండటంతో.. విరాట్ కోహ్లి ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. చివరి 15 ఓవర్లలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని విరాట్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలో దిగుతోంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ చేతి వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో శామ్ బిల్లింగ్స్ బరిలో దిగనున్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతడి స్థానంలో బెయిర్‌స్టో ఆడుతున్నాడు.
Samayam Telugu india vs englnad india won the toss elected to fiedl first
ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి.. రహానేకు అవకాశం


భారత జట్టు కూడా ఓ మార్పతో బరిలోకి దిగుతోంది. తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఓపెనర్ శిఖర్ ధవన్ స్థానంలో అజింక్య రహానేను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఇంగ్లండ్ జట్టు: జాసన్ రాయ్, శామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెయిర్‌స్టో, జాస్ బట్లర్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, లియామ్ ఫ్లంకెట్, జేక్ బాల్, డేవడ్ విల్లే.

భారత జట్టు: అజింక్య రహానే, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.