యాప్నగరం

లెగ్ బై డెసిషన్‌తో కోహ్లిని నవ్వించిన ధర్మసేన

అంపైర్ ధర్మసేన తన నిర్ణయంతో కెప్టెన్ కోహ్లిని నవ్వించాడు.

TNN 22 Jan 2017, 6:13 pm
ఈడెన్ గార్డెన్స్ వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బుమ్రా విసిరిన బౌన్సర్ మొయిన్ అలీ బ్యాట్‌ను తాకుతూ.. కీపర్‌ను దాటుకుంటూ వెళ్లి బౌండరీని చేరింది. దాన్ని అందుకునేందుకు ధోనీ, స్లిప్‌లో ఉన్న కోహ్లి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాన్ని అంపైర్ ధర్మసేన బౌండరీ ఇవ్వకుండా లెగ్ బై ఇచ్చాడు. అది చూసిన కోహ్లి నవ్వు ఆపుకోలేకపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలింది. పాపం మొయిన్ అలీ అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. దాన్ని అంపైర్ బౌండరీ ఇచ్చి ఉంటే అలీ ఖాతాలో కనీసం ఓ బౌండరీ అయినా చేరేది. ధర్మసేన నిర్ణయం పుణ్యామని రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ధర్మసేన నిర్ణయాలు అప్పుడప్పుడూ వివాదాస్పదం అవుతాయనే సంగతి తెలిసిందే.
Samayam Telugu india vs englnd third odi dharmasena decission makes kohli laugh
లెగ్ బై డెసిషన్‌తో కోహ్లిని నవ్వించిన ధర్మసేన


322 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ధవన్ బదులు జట్టులోకి వచ్చిన రహానే ఒక్క పరుగు మాత్రమే చేసి విల్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 15 పరుగులతో, లోకేష్ రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.