ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా రెండో టీ20లోనూ టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య.. తుది జట్టులో మూడు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. గాయం కారణంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో సంజు శాంసన్ టీమ్లోకి వచ్చాడు. అలానే అవేష్ ఖాన్, యుజ్వేందర్ చాహల్ స్థానాల్లో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు.
డబ్లిన్ వేదికగానే గత ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ని వర్షం కారణంగా 12 ఓవర్లకి కుదించగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దూకుడుగా ఆడిన టీమిండియా 9.2 ఓవర్లలోనే 111/3తో లక్ష్యాన్ని ఛేదించేసింది.
డబ్లిన్ వేదికగానే గత ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ని వర్షం కారణంగా 12 ఓవర్లకి కుదించగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దూకుడుగా ఆడిన టీమిండియా 9.2 ఓవర్లలోనే 111/3తో లక్ష్యాన్ని ఛేదించేసింది.