యాప్నగరం

తొలి టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

భారత్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్

TNN 1 Nov 2017, 6:44 pm
భారత్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న భారత్ ఫుల్ జోష్‌మీదుండగా.. ఒత్తిడిలోనే న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆశిష్ నెహ్రాకి భారత్ తుది జట్టులో కోహ్లి అవకాశం ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ టీ20తో టీమిండియాలోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ రెండు జట్లు టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఐదింట్లోనూ కివీస్‌దే పైచేయిగా నిలిచింది.
Samayam Telugu india vs new zealand 1st t20 new zealand opt to bowl
తొలి టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్


భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, చాహల్

న్యూజిలాండ్ తుది జట్టు: గప్తిల్, మున్రో, విలియమ్సన్, బ్రూసీ, లాథమ్, నికోలస్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, సౌథీ, బౌల్ట్, సోథీ

New Zealand wins the toss. Elects to bowl first #INDvNZ pic.twitter.com/g8kcmvndMw — BCCI (@BCCI) November 1, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.