యాప్నగరం

రెండో టీ20కి రూ.5 కోట్ల బీమా..!

భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కి ముందస్తు జాగ్రత్తలో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) రూ.

TNN 3 Nov 2017, 12:54 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కి ముందస్తు జాగ్రత్తలో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) రూ. 5 కోట్లు బీమా చేయించింది. రాత్రి 7 గంటలకి రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. రాజ్‌కోట్ టీ20లో కూడా గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
Samayam Telugu india vs new zealand 2017 18 2nd t20i at rajkot sca insures tie for inr 5 crores
రెండో టీ20కి రూ.5 కోట్ల బీమా..!


‘మ్యాచ్‌ కోసం రాజ్‌కోట్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 28 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశం ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు రెండు విమానాల్లో ఇక్కడికి వస్తారు. ఏదైనా అనివార్య కారణాల వల్ల మ్యాచ్‌‌ ఆగిపోతుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఎస్‌సీఏ రూ.5 కోట్లు బీమా చేయించింది’ అని ఎస్‌సీఏ మీడియా మేనేజర్ హిమాన్షు వెల్లడించాడు. 2013, అక్టోబరు 10న ఈ వేదికపై ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.