యాప్నగరం

టాస్ దగ్గరే కివీస్ తప్పు చేసిందా..?

భారత్‌తో పుణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ దగ్గరే న్యూజిలాండ్ జట్టు తప్పు చేసిందా..? అంటే అవుననే

TNN 26 Oct 2017, 4:18 pm
భారత్‌తో పుణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ దగ్గరే న్యూజిలాండ్ జట్టు తప్పు చేసిందా..? అంటే అవుననే చెప్తున్నాడు భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తాను ఆశ్చర్యపోయినట్లు ధావన్ వెల్లడించాడు. వాంఖడే వన్డేలో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓడిపోగా.. పుణె వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. ఉక్కపోతలో కూడా భారత బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తే.. ఫీల్డర్లు వారికి చక్కటి సహకారం అందించారని ధావన్ ప్రశంసించాడు. అందరి సమష్టి కృషితోనే న్యూజిలాండ్‌ని 230కే కట్టడి చేయగలిగినట్లు ఈ ఓపెనర్ గుర్తు చేశాడు.
Samayam Telugu india vs new zealand 2nd odi shikhar dhawan credits bowlers for levelling series
టాస్ దగ్గరే కివీస్ తప్పు చేసిందా..?


‘పుణె పిచ్‌పై ఆరంభంలో భారత్ బౌలర్లకి ఎలాంటి సీమ్ లభించలేదు. కానీ.. నా అంచనా ప్రకారం మన ఫాస్ట్ బౌలర్లను వారు ఎదుర్కోవడం కంటే.. భారత బ్యాట్స్‌మెన్‌ వారి పేసర్లని సమర్థంగా ఎదుర్కొన్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సాయంత్రం వేళల్లో ఇక్కడ మంచు కురుస్తోంది. ఈ కారణంతోనే ఆ జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపించి ఉండొచ్చు’ అని ధావన్ వెల్లడించాడు. ఛేదనలో బంతి కొంచెం నెమ్మదించి బ్యాట్‌పైకి వచ్చినా.. పెద్ద‌గా ఇబ్బంది పడకుండా షాట్స్ ఆడినట్లు ఈ ఓపెనర్ గుర్తు చేశాడు. సిరీస్‌లో విజేత నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.