యాప్నగరం

కివీస్‌తో రెండో టెస్టులో లంచ్‌కి భారత్ 85/2

కివీస్ గడ్డపై రెండో టెస్టులోనూ భారత్ తడబడుతోంది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత ఓపెనర్లు మరోసారి టీమ్‌కి మెరుగైన ఆరంభాన్నివ్విలేకపోయారు. దీంతో.. లంచ్‌లోపే రెండు వికెట్లని భారత్ చేజార్చుకుంది.

Samayam Telugu 29 Feb 2020, 7:25 am
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7: 11 బంతుల్లో 1x4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (54: 64 బంతుల్లో 8x4, 1x6) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ బాదినప్పటికీ కీలక సమయంలో ఔటైపోయాడు. దీంతో.. లంచ్ విరామానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85/2తో నిలిచింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్: 49 బంతుల్లో 2x4), విరాట్ కోహ్లీ (3 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు.
Samayam Telugu Wellington: Indias Mayank Agarwal reacts after being dismissed by New Zealands...


ఇటీవల ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియాకి మెరుగైన ఆరంభాలివ్వలేకపోయిన భారత ఓపెనర్లు.. ఈరోజు కూడా తొలి వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యమే నెలకొల్పారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. భారత ఇన్నింగ్స్ ఆరంభించిన పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ కాసేపు సహనంతో క్రీజులో నిలిచి ఆ తర్వాత కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ.. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లోనే పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు.

మయాంక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి నిలకడగా ఆడిన పృథ్వీ షా.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. రెండు రోజుల క్రితం గాయపడిన ఈ యువ ఓపెనర్ అనూహ్యంగా ఫిట్‌నెస్ సాధించి ఎట్టకేలకి ఫామ్ అందుకున్నాడు. కానీ.. భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. జెమీషన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడి లాథమ్‌కి క్యాచ్ ఇచ్చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.