యాప్నగరం

ఎదురీదుతున్న న్యూజిలాండ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎదురీదుతోంది.

TNN 3 Oct 2016, 2:49 pm
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎదురీదుతోంది. 376 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మార్టిట్ గుప్తిల్ (24), హెన్రీ నికోలస్ (24), రాస్ టేలర్ (4) పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం టామ్ లాథమ్ (74), ల్యూక్ రోంచి (9) క్రీజులో ఉన్నారు
Samayam Telugu 3 at tea break
ఎదురీదుతున్న న్యూజిలాండ్

న్యూజిలాండ్ విజయం సాధించాలంటే మరో 241 పరుగులు చేయాల్సి ఉంటుంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే కప్‌ సొంతమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.