న్యూజిలాండ్పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన టీమిండియా.. క్లీన్స్వీప్పై కన్నేసింది. భారత్, న్యూజిలాండ్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో టీ20 సిరీస్ని కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి టీ20లోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ 2021లో ఫైనల్కి చేరిన న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టీ20లకి వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ రూపంలో ఇద్దరు కొత్త క్రికెటర్లకి అవకాశమిచ్చిన టీమిండియా మేనేజ్మెంట్.. సిరీస్ చేజిక్కిన నేపథ్యంలో.. ఈ ఆఖరి టీ20లో ప్రయోగాలని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కి విశ్రాంతినిచ్చి వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, యుజ్వేందర్ చాహల్ని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే ఫాస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహర్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి అవేష్ ఖాన్ని ఆడించాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది.
ఫస్ట్ రెండు టీ20ల్లో టాస్ గెలిచిన భారత్ జట్టు.. ఛేదనకు దిగి విజయాల్ని అందుకుంది. టీమ్కి కూడా పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. కానీ.. మూడో టీ20లో ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే? ఎలా ఆడుతుందో చూడాలి. కోల్కతా పిచ్ సహజసిద్ధంగానే స్పిన్కి అనుకూలించనుండగా.. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఉండనుంది. దాంతో.. ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఫస్ట్ రెండు టీ20ల్లో టాస్ గెలిచిన భారత్ జట్టు.. ఛేదనకు దిగి విజయాల్ని అందుకుంది. టీమ్కి కూడా పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. కానీ.. మూడో టీ20లో ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే? ఎలా ఆడుతుందో చూడాలి. కోల్కతా పిచ్ సహజసిద్ధంగానే స్పిన్కి అనుకూలించనుండగా.. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం ఉండనుంది. దాంతో.. ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.