యాప్నగరం

కీపర్ సాహా మ్యాచ్‌లు ఆడొద్దు: బీసీసీఐ ఆదేశం

టెస్టు క్రికెట్‌లో తిరుగులేని వికెట్ కీపర్‌గా రాణిస్తున్న సాహాని రంజీ మ్యాచ్‌లు ఆడొద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. కారణం.. ?

Samayam Telugu 22 Jan 2020, 12:30 pm
భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి బీసీసీఐ నుంచి ఊహించని రీతిలో ఆదేశాలు వెళ్లాయి. బెంగాల్ టీమ్‌ తరఫున రంజీల్లో ఆడుతున్న ఈ వికెట్ కీపర్‌ని త్వరలో ఢిల్లీ జట్టుతో జరగబోవు మ్యాచ్‌లో ఆడొద్దంటూ బీసీసీఐ ఆదేశించింది. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడితే సాహా గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది.
Samayam Telugu Pune: Indias wicket-keeper Wriddhiman Saha dives to take a catch to dismiss Sou...


IND vs NZ 2020: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. పృథ్వీ షాకి పిలుపు

ఢిల్లీ టీమ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన ఇషాంత్ శర్మ.. రెండు రోజుల క్రితం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతని కాలి మడమకి తీవ్ర గాయమవడంతో న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి ఇప్పటికే ఈ పేసర్ తప్పుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో శిఖర్ ధావన్ భుజానికి గాయమైంది. దీంతో.. గబ్బర్ కూడా కివీస్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్ల సేవల్ని కోల్పోయిన భారత్.. కివీస్‌తో సిరీస్ వరకూ క్రికెటర్లు గాయపడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Read More: ధోనీకి కాంట్రాక్ట్ ఎందుకివ్వాలి..?: బీసీసీఐకి సెహ్వాగ్ సపోర్ట్

జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని టీమిండియా ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్లని భారత సెలక్టర్లు ప్రకటించారు. శిఖర్ ధావన్‌ స్థానంలో టీ20లకి సంజు శాంసన్‌ ఎంపికవగా.. వన్డేల్లో పృథ్వీ షాకి ఆ అవకాశం దక్కింది.

Read More: కోహ్లీ ప్రశ్నకి నోరెళ్లబెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.