యాప్నగరం

కివీస్ టీ20 జట్టులోకి మళ్లీ రాస్ టేలర్..!

భారత్ చేతిలో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు కనీసం టీ20ల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆదివారం కాన్పూర్‌లో ముగిసిన

TNN 31 Oct 2017, 2:58 pm
భారత్ చేతిలో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు కనీసం టీ20ల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆదివారం కాన్పూర్‌లో ముగిసిన సిరీస్ ‌నిర్ణయాత్మక మూడో వన్డే‌లో 6 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి చవిచూసిన కివీస్.. బుధవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌ కోసం జట్టులో కీలక మార్పు చేసింది. లెగ్ స్పిన్నర్‌, మిడిలార్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాడ్ ఆస్లే‌ని టీ20 జట్టు నుంచి పక్కకి తప్పించి సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ని జట్టులోకి తీసుకుంది.
Samayam Telugu india vs new zealand t20 ross taylor replaces injured todd astle
కివీస్ టీ20 జట్టులోకి మళ్లీ రాస్ టేలర్..!


భారత్‌తో తాజాగా ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో టేలర్ మొత్తంగా 155 పరుగులు చేసి మునుపటి ఫామ్‌ని అందుకున్నాడు. దీంతో గత ఏడాది మార్చిలో చివరి సారి టీ20లు ఆడిన ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్‌‌ని మళ్లీ టీ20 జట్టులో తీసుకుంటూ కివీస్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ‘రాస్ టేలర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అందుకే మిడిలార్డర్‌లో అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావించాం. ఈ ఎంపిక టాడ్ ఆస్లే‌కి బాధ కలిగిస్తుంది. కానీ.. సీనియర్ బ్యాట్స్‌మెన్ అనుభవం టీ20 జట్టుకి ఈ సిరీస్‌లో కలిసొస్తుంది’ అని కివీస్ కోచ్ మైక్ హెస్సన్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి టీ20 మ్యాచ్ ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.