డబుల్ సెంచరీతో గవాస్కర్ సరసన మయాంక్
భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోపే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డ్ల్లో చోటు దక్కించుకున్నాడు. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్.. భారత్ తరఫున వేగంగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా నిలిచాడు.
Samayam Telugu 3 Oct 2019, 3:55 pm
ప్రధానాంశాలు:
- వైజాగ్ టెస్టులో రికార్డుల మోత మోగించిన మయాంక్ అగర్వాల్
- డబుల్ సెంచరీతో గవాస్కర్ సరసన మయాంక్
- రికార్డ్లో ముందు వరుసలో కరుణ్ నాయర్, వినోద్ కాంబ్లి
- రోహిత్ శర్మతో తొలి వికెట్కి 371 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్
భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కెరీర్లో తొలి ద్విశతకం నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డ్లో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్ (215: 371 బంతుల్లో 23x4, 6x6).. కెరీర్లో వేగంగా డబుల్ సెంచరీ మార్క్ని అందుకున్న మూడో భారత క్రికెటర్గా నిలిచాడు. IND vs SA 1st Test LIVE Score కోసం క్లిక్ చేయండి..!
భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా డబుల్ సెంచరీ మార్క్ని అందుకున్న ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. కరుణ్ నాయర్ కెరీర్లో మూడో టెస్టు ఇన్నింగ్స్లోనే ద్విశతకాన్ని సాధించగా.. వినోద్ కాంబ్లి 4వ ఇన్నింగ్స్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. ఇక తాజాగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్స్తో డబుల్ సెంచరీ సాధించగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సరిగ్గా 8వ ఇన్నింగ్స్లోనే ఆ మార్క్ని అందుకున్నాడు. దీంతో.. మూడో స్థానంలో గవాస్కర్ సరసన రికార్డ్లో మయాంక్ నిలిచాడు.
Read More: మయాంక్- రోహిత్ శర్మ జోడీ రికార్డుల మోత
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆరేసి ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (5), గవాస్కర్ (4), చతేశ్వర్ పుజారా (3) టాప్-6లో ఉన్నారు. మొత్తంగా.. భారత్ తరఫున 52వ డబుల్ సెంచరీ ఈరోజు నమోదైంది.
భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా డబుల్ సెంచరీ మార్క్ని అందుకున్న ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. కరుణ్ నాయర్ కెరీర్లో మూడో టెస్టు ఇన్నింగ్స్లోనే ద్విశతకాన్ని సాధించగా.. వినోద్ కాంబ్లి 4వ ఇన్నింగ్స్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. ఇక తాజాగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్స్తో డబుల్ సెంచరీ సాధించగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సరిగ్గా 8వ ఇన్నింగ్స్లోనే ఆ మార్క్ని అందుకున్నాడు. దీంతో.. మూడో స్థానంలో గవాస్కర్ సరసన రికార్డ్లో మయాంక్ నిలిచాడు.
Read More: మయాంక్- రోహిత్ శర్మ జోడీ రికార్డుల మోత
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆరేసి ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ (5), గవాస్కర్ (4), చతేశ్వర్ పుజారా (3) టాప్-6లో ఉన్నారు. మొత్తంగా.. భారత్ తరఫున 52వ డబుల్ సెంచరీ ఈరోజు నమోదైంది.