యాప్నగరం

IND vs SA 1st ODI ఆలస్యానికి కారణమిదే

ధర్మశాల వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకి ప్రారంభంకావాల్సిన తొలి వన్డే మ్యాచ్.. ఆలస్యంగా ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా.. మైదానం చిత్తడిగా మారినట్లు కనిపిస్తోంది.

Samayam Telugu 12 Mar 2020, 1:15 pm
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా ఈరోజు మధ్యాహ్నం ప్రారంభంకావాల్సిన తొలి వన్డే ఆలస్యంకానుంది. ధర్మశాల స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం పడటంతో.. పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచడం ద్వారా మైదానం సిబ్బంది కాపాడగలిగారు. కానీ.. మైదానంలోకి కొన్ని ప్రదేశాల్లో నీరు నిల్వడంతో ప్రస్తుతం సిబ్బంది ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. ఒంటి గంటకి పడాల్సిన టాస్ కూడా ఆలస్యంకానుంది.
Samayam Telugu 11


వాస్తవానికి గత ఏడాది సెప్టెంబరులోనూ భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ఇలానే వర్షం కారణంగా రద్దయింది. అయితే.. ఈరోజు వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. మైదానం చిత్తడిగా మారడంతో దాన్ని మ్యాచ్‌కి అనువుగా సిద్ధం చేసేందుకు మైదానం సిబ్బంది శ్రమిస్తున్నారు. దీంతో.. 1.30 గంటలకి ప్రారంభకావాల్సిన మ్యాచ్‌ కనీసం అరగంట ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకూ 84 వన్డేలాడిన భారత్ జట్టు 35 మ్యాచ్‌ల్లో గెలిచి.. ఏకంగా 46 మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది. ఓ మూడింట్లో మ్యాచ్‌ల్లో రిజల్ట్ రాలేదు. కానీ.. 2018 నుంచి మాత్రం సఫారీలపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోందని రికార్డులు చెప్తున్నాయి. ఎంతలా అంటే..? చివరిగా దక్షిణాఫ్రికాతో ఆడిన ఏడు వన్డేల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే భారత్ జట్టు ఓడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.