యాప్నగరం

విమర్శలకి తలొగ్గని కోహ్లి.. మళ్లీ సాహసం

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన అనంతరం తుది జట్టు

TNN 13 Jan 2018, 2:02 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన అనంతరం తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. సఫారీ పిచ్‌లపై మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న అజింక్య రహానెని తప్పించి.. రోహిత్ శర్మకి అవకాశం ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. అయితే.. సెంచూరియన్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టులోనూ రోహిత్ శర్మకి ఛాన్సిచ్చాడు. గత ఏడాది చివర్లో శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో రోహిత్ శర్మ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే.
Samayam Telugu india vs south africa 2nd test virat kohli makes 3 changes for centurion test
విమర్శలకి తలొగ్గని కోహ్లి.. మళ్లీ సాహసం


ఇటీవల ఫామ్ ఆధారంగానే తుది జట్టుని ఎంపిక చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కోహ్లి.. రెండో టెస్టుకి తుది జట్టులో మొత్తం మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, గాయపడిన సాహా స్థానంలో పార్థీవ్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌కి బదులుగా ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చారు. కేప్‌టౌన్ టెస్టులో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన భువనేశ్వర్‌ని పక్కన పెట్టడం కోహ్లి సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. ఒకవేళ ఈ టెస్టులో బౌలర్లు విఫలమైతే.. కోహ్లి విమర్శలకి మళ్లీ సిద్ధమవ్వాల్సిందే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.