శ్రీలంకతో గత ఏడాది చివర్లో టెస్టు సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం తనకు మంచి చేసిందని భారత యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైన వేళ హార్దిక్ పాండ్య (93: 95 బంతుల్లో 14x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ పరువు నిలిపిన విషయం తెలిసిందే. గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో హార్దిక్ చేతికి గాయమైంది. దీంతో.. తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ నుంచి సెలక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు.
‘నేను అబద్దం చెప్పడం లేదు.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. శ్రీలంకతో టెస్టు సిరీస్ విశ్రాంతి సమయంలో ఫిటెనెస్, బ్యాటింగ్ మెరుగుపర్చుకున్నా. గత కొద్దిరోజులుగా ఈ దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించే అంతా చర్చించారు. దీంతో సిరీస్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జీవితంలో సవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. అవి మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని నమ్ముతా’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. టెయిలెండర్ భువనేశ్వర్ కుమార్తో కలిసి 8వ వికెట్కి హార్దిక్ పాండ్య 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులైనా చేయగలిగింది.
‘నేను అబద్దం చెప్పడం లేదు.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. శ్రీలంకతో టెస్టు సిరీస్ విశ్రాంతి సమయంలో ఫిటెనెస్, బ్యాటింగ్ మెరుగుపర్చుకున్నా. గత కొద్దిరోజులుగా ఈ దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించే అంతా చర్చించారు. దీంతో సిరీస్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జీవితంలో సవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. అవి మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని నమ్ముతా’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. టెయిలెండర్ భువనేశ్వర్ కుమార్తో కలిసి 8వ వికెట్కి హార్దిక్ పాండ్య 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులైనా చేయగలిగింది.