యాప్నగరం

టీమిండియా ఓటమి ఊహించిందే: గంగూలీ

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు తొలి టెస్టులో ఓడిపోవడం తనని ఏమీ ఆశ్చర్యానికి గురి చేయలేదని మాజీ కెప్టెన్ సౌరవ్

TNN 10 Jan 2018, 6:52 pm
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ జట్టు తొలి టెస్టులో ఓడిపోవడం తనని ఏమీ ఆశ్చర్యానికి గురి చేయలేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 208 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా విఫలమై 136 పరుగులకే ఆలౌటయ్యారు. తుది జట్టు ఎంపికే అస్తవ్యస్తంగా ఉందని.. విదేశీ గడ్డపై పేలవ బ్యాటింగ్ రికార్డు ఉన్న ఆటగాళ్లకి జట్టులో చోటివ్వడంతో ఓటమిని తాను ముందే ఊహించినట్లు గంగూలీ వివరించాడు.
Samayam Telugu india vs south africa i was not surprised by the result says ganguly
టీమిండియా ఓటమి ఊహించిందే: గంగూలీ


‘విదేశీ గడ్డపై రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ రికార్డులు ఏమంత సంతృప్తికరంగా లేవు. తొలి టెస్టు తుది జట్టులో మురళీ విజయ్, విరాట్ కోహ్లి మాత్రమే సత్తా చాటినవారు. చతేశ్వర్ పుజారా కూడా అతను చేసిన సెంచరీల్లో ఎక్కువగా ఉపఖండ పిచ్‌లపై సాధించినవే. అతనితో పోలిస్తే కేఎల్ రాహుల్ కొంచెం మెరుగు. ఎందుకంటే అతను ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంకలో మెరుగ్గా రాణించాడు. తుది జట్టు ఎంపికకి కేవలం ఫామ్‌ని చూస్తే సరిపోదు.. బ్యాట్స్‌మెన్ ఏ గడ్డపై పరుగులు సాధించాడో చూడాలి. తొలి టెస్టు ఓటమి నన్ను ఏమీ ఆశ్చర్యపరచలేదు’ అని గంగూలీ వివరించాడు. తొలి టెస్టుకి రహానె స్థానంలో రోహిత్ శర్మని ఇటీవల సిరీస్‌లో ఫామ్‌ చూసి ఎంపిక చేసినట్లు మ్యాచ్ అనంతరం కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.