యాప్నగరం

గంగూలీ ఇదేనా గౌరవం..? మమతా బెనర్జీ ఫైర్

కోల్‌కతాలో మ్యాచ్‌ కోసం పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అన్నీ సిద్ధంచేయగా.. కరోనా వైరస్ కారణంగా ఆ మ్యాచ్‌ని బీసీసీఐ రద్దు చేసింది. కానీ.. రద్దుకి ముందు ఒక మాట కూడా ప్రభుత్వానికి చెప్పలేదని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.

Samayam Telugu 15 Mar 2020, 8:11 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 18న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మూడో వన్డే జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ మ్యాచ్‌‌తో పాటు మొత్తంగా మూడు వన్డేల సిరీస్‌నే బీసీసీఐ రద్దు చేసింది. కానీ.. కోల్‌కతాలో మ్యాచ్‌ రద్దు చేసే ముందు తమకి ఒక మాట చెప్పింటే గౌరవంగా ఉండేదని మమతా బెనర్జీ మండిపడ్డారు.
Samayam Telugu Sourav Ganguly ,Mamata Banerjee


‘సౌరవ్ గంగూలీతో అంతా బాగుంది. కానీ మ్యాచ్‌ రద్దుకి ముందు ఒక మాట అయినా ప్రభుత్వంతో చెప్పి ఉండాల్సింది. కనీసం కోల్‌కతా పోలీసులకైనా సమాచారం ఇచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. అంతేతప్ప మ్యాచ్ రద్దయిన తర్వాత చెప్తే ఉపయోగమేంటి..? అయినా మేము మ్యాచ్‌ని నిలిపివేయమని ఏమీ అడగలేదే..! చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ కమీషనర్ లేదా ప్రభుత్వ పెద్దలకి ఒక మాట చెప్పడం కనీస గౌరవం కదా..?’ అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి గత వారం రోజులుగా తమ రాష్ట్రంలో ఐపీఎల్ నిర్వహించొద్దంటూ కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ.. పశ్చిమ బెంగాల్ నుంచి అలాంటి కండీషన్‌లు ఏమీ వినిపించలేదు. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడు అవగానే సంతోషించిన వ్యక్తుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరు. కానీ.. మ్యాచ్ రద్దు విషయంలో తమ ప్రభుత్వానికి ఒక మాట కూడా చెప్పకపోవడంపై ఆమెకి కోపం వచ్చినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.