యాప్నగరం

కోహ్లీ.. జట్టును మార్చొద్దు: కెప్టెన్‌కు గంగూలీ బాసట

రెండో టెస్టులో జట్టు ఎంపిక విషయంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ‌ విరాట్ కోహ్లిని సమర్థించాడు.

TNN 12 Jan 2018, 2:52 pm
తొలి టెస్టులో కోహ్లి సేన ఓటమి తర్వాత భారత జట్టు కూర్పుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విదేశీ గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న అజింక్య రహానేను కాదని రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించడం, కేఎల్ రాహుల్‌ను పక్కనబెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటీవలి ప్రదర్శన ఆధారంగానే రోహిత్‌కు అవకాశం కల్పించామని కోహ్లి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
Samayam Telugu india vs south africa sourav ganguly backs virat kohli to continue with shikhar dhawan rohit sharma
కోహ్లీ.. జట్టును మార్చొద్దు: కెప్టెన్‌కు గంగూలీ బాసట


రెండో టెస్టులో కేఎల్ రాహుల్, అజింక్య రహానేలకు తుది జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా, జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచిస్తున్నాడు. న్యూలాండ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ అద్భుతంగా సాగిందని, బౌలర్లు అద్భుతంగా రాణించారని గంగూలీ చెప్పుకొచ్చాడు.

మిగతా టెస్టుల్లోనూ భారత బౌలర్లు ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయాలి. భారత్‌ను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోన్న సమస్య బ్యాటింగ్ వైఫల్యం. కాబట్టి బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి, పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. ఓటమి ఎదురయ్యాక తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్ల విషయం చర్చకు రావడం సాధారణమే. విరాట్ కోహ్లి ఈ విషయాల గురించి చింతించొద్దు. కేఎల్ రాహుల్, రహానేలకు విదేశాల్లో మెరుగైన రికార్డ్ ఉంది. కానీ కోహ్లి ప్రస్తుత ఫామ్‌ను బట్టి జట్టును ఎంపిక చేశాడు. రెండో టెస్టులోనూ అదే కొనసాగించాలని గంగూలీ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.