యాప్నగరం

సిరీస్‌లో భారత్ పుంజుకోవడం కష్టమే: సెహ్వాగ్

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు‌లో ఘోర పరాజయం చవిచూసిన భారత్‌ జట్టు సిరీస్‌లో పుంజుకోవడం ఇక కష్టమేనని మాజీ

TNN 11 Jan 2018, 1:55 pm
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు‌లో ఘోర పరాజయం చవిచూసిన భారత్‌ జట్టు సిరీస్‌లో పుంజుకోవడం ఇక కష్టమేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సోమవారం కేప్‌టౌన్‌ వేదికగా ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్ సెంచూరీయన్ వేదికగా శనివారం మధ్యాహ్నం
Samayam Telugu india vs south africa virender sehwag says indias chances of coming back strongly are tough
సిరీస్‌లో భారత్ పుంజుకోవడం కష్టమే: సెహ్వాగ్

నుంచి జరగనుంది. తుది జట్టులో రహానెకి అవకాశం కల్పించాలని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ‌లు జట్టు స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు.

‘సిరీస్‌లో భారత్‌ పుంజుకునే అవకాశాలు ప్రస్తుతం 30 శాతం మాత్రమే ఉన్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా సెంచూరీయన్ పిచ్‌‌కి అనుగుణంగా జట్టులో మార్పులు చేస్తే మంచిది. అశ్విన్ అవసరం ఉండదనుకుంటే.. అతని స్థానంలో అజింక్య రహానె రూపంలో ఒక అదనపు బ్యాట్స్‌మెన్‌కి ఛాన్సివ్వాలి. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఒక ఆల్‌ రౌండర్‌తో రెండో టెస్టులో బరిలోకి దిగితే బాగుంటుంది. భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా.. ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతుల్ని వెంటాడే ప్రయత్నం మానుకోవాలి. ఎక్కువగా స్ట్రైట్ షాట్స్‌ ఆడేందుకు ప్రయత్నిస్తే మేలు’ అని సెహ్వాగ్ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.