యాప్నగరం

ఓపెనర్ల దూకుడు: నాలుగో రోజు మనదే!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు కదం తొక్కడంతో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది.

TNN 19 Nov 2017, 5:50 pm
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు కదం తొక్కడంతో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ దూకుడు చూపిస్తూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్- రాహుల్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ధావన్ సెంచరీ చేరువలో వేగంగా పరుగుల కోసం ప్రయత్నించి 94 పరుగుల వద్ద (116 బంతులు 11ఫోర్లు, 2 సిక్స్‌లు) శనక బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రాహుల్‌(73 నాటౌట్‌),పుజారా(2 నాటౌట్‌)లు ఉన్నారు. దీంతో, శ్రీలంకపై భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Samayam Telugu india vs sri lanka 1st test kl rahul shikhar dhawan lead ind fightback
ఓపెనర్ల దూకుడు: నాలుగో రోజు మనదే!


ఇక నాలుగో రోజు 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, షమీలకు నాలుగు వికెట్లు దక్కగా.. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక చివరి రోజు మాత్రమే మిగిలిఉండటంతో కోల్‌కతా టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.