యాప్నగరం

రాహుల్ క్లీన్ బౌల్డ్.. మరో సెంచరీ మిస్!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా సాగుతోంది.

TNN 20 Nov 2017, 10:10 am
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా సాగుతోంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టడం.. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని దాదాపు అంతా అనుకున్నారు. అయితే ఐదో రోజు ఆట ఆరంభించిన అరగంటలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ రూపంలో భారత్ కీలక వికెట్ కోల్పోయింది.
Samayam Telugu india vs sri lanka 1st test rahul falls early on day 5
రాహుల్ క్లీన్ బౌల్డ్.. మరో సెంచరీ మిస్!


పేసర్ సురంగ లక్మల్ వేసిన అద్భుత బంతికి రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సెంచరీకి చేరువవుతున్న తరుణంలో పెవిలియన్‌కు చేరాడు. ఆదివారం మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తృటిలో సెంచరీని చేజార్చుకున్న విషయం తెలిసిందే. దూకుడుగా ఆడుతూ 94 పరుగుల వద్ద ఔటైన ధావన్ నిరాశతో వెనుదిరిగాడు.

అయితే నాలుగో రోజు 73 పరుగులతో ఆజేయంగా నిలిచిన రాహుల్.. ఐదో రోజు మరో 6 పరుగులు జోడించి ఔటయ్యాడు. ప్రస్తుతం ఛటేశ్వర్ పుజారా (17), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) క్రీజులో ఉన్నారు. భారత్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ప్రస్తుతం 80 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో వికెట్ పడకుండా పుజారా, కోహ్లీ జాగ్రత్తగా ఆడాలి. అయితే ఇప్పటికీ డ్రా అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలంక బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప మ్యాచ్ ఫలితంలో మార్పు ఉండదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.