శ్రీలంక గడ్డపై జులైలో పర్యటించనున్న భారత జట్టుకి కెప్టెన్గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంపికవడం దాదాపు లాంఛనమైంది. ఈ నెల ఆరంభంలో ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ న్యూజిలాండ్తో ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడి ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. దాంతో.. కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ఒకటి ఇంగ్లాండ్లో ఉండగానే.. మరో జట్టు శ్రీలంకలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ని ఆడనుంది. ఈ టీమ్ని కెప్టెన్గా శిఖర్ ధావన్ నడిపించబోతున్నాడు. ఇంగ్లాండ్ టూర్కి ఎంపికవని భారత క్రికెటర్లతో రెండో జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉన్నారు.
జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుండగా.. అనంతరం 16న రెండో వన్డే, 18న మూడో వన్డేని నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 21న ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగనుండగా.. అనంతరం 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ సిరీస్కి చీఫ్ కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్లన్నీ కొలంబో వేదికగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.
జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుండగా.. అనంతరం 16న రెండో వన్డే, 18న మూడో వన్డేని నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 21న ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగనుండగా.. అనంతరం 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ సిరీస్కి చీఫ్ కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్లన్నీ కొలంబో వేదికగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.