యాప్నగరం

​ వరుసగా రెండో అర్ధశతకం బాదిన శ్రేయాస్

శ్రీలంక జట్టుపై వన్డే సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో అర్ధశతకం బాదేశాడు. విశాఖపట్నం

TNN 17 Dec 2017, 6:53 pm
శ్రీలంక జట్టుపై వన్డే సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో అర్ధశతకం బాదేశాడు. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శ్రేయాస్ తన కెరీర్‌లో రెండో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో 216 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు 18 ఓవర్లు ముగిసే సమయానికి 109/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. శ్రేయాస్‌తో పాటు క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్ (38: 39 బంతుల్లో 5x4) ఉన్నాడు.
Samayam Telugu india vs sri lanka 3rd odi at visakhapatnam shreyas on fire
​ వరుసగా రెండో అర్ధశతకం బాదిన శ్రేయాస్


మూడు వన్డేల ఈ సిరీస్‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్.. ధర్మశాలలో గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ.. బుధవారం జరిగిన మొహాలి వన్డేలో 88 పరుగులతో సత్తా చాటిన శ్రేయాస్.. తాజా వన్డేలో అర్ధ శతకంతో జట్టు మిడిలార్డర్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మైదానంలో ఇబ్బందిపడుతున్న దశలో.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ కళాత్మక షాట్లతో అతని కంటే ముందుగానే అర్ధశతకం సాధించడం విశేషం. శ్రేయాస్‌కి కెరీర్‌లో ఇది మూడో వన్డేనే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.