యాప్నగరం

భారత్ చేతిలో శ్రీలంక క్లీన్‌స్వీప్..!

భారత్ జట్టు ఘన విజయంతో ఈ ఏడాదిని ముగించింది. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 5

TNN 24 Dec 2017, 10:40 pm
భారత్ జట్టు ఘన విజయంతో ఈ ఏడాదిని ముగించింది. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌లో లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేసేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. గుణరత్నె (36: 37 బంతుల్లో 3x4), శనక (29 నాటౌట్: 24 బంతుల్లో 2x6) నిలకడగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మనీశ్ పాండే (32: 29 బంతుల్లో 4x4) శ్రేయాస్ అయ్యర్ (30: 32 బంతుల్లో 1x4, 1x6), కెప్టెన్ రోహిత్ శర్మ (27: 20 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడటంతో భారత్ 19.2 ఓవర్లలో 139/5తో విజయం సాధించింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, జయదేవ్ ఉనద్కత్ చెరో రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో భారత్ జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.
Samayam Telugu india vs sri lanka 3rd t20
భారత్ చేతిలో శ్రీలంక క్లీన్‌స్వీప్..!


ఛేదనలో చివరి 7 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో భారత్‌ శిబిరంలో ఒత్తిడి కనిపించింది. అయితే.. క్రీజులో మహేంద్రసింగ్ ధోని (16 నాటౌట్: 10 బంతుల్లో 2x4), దినేశ్ కార్తీక్ (18 నాటౌట్: 12 బంతుల్లో 1x6) ఉండటంతో అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ప్రదీప్ చివరి బంతిని ఫుల్‌టాస్‌గా విసరగా.. దినేశ్ కార్తీక్ కళ్లు చెదిరే రీతిలో సిక్సర్‌గా మలచడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ రెండో బంతిని ధోనీ బౌండరీకి తరలించి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.