వాంఖడే వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టు ఆదిలోనే తడబడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓపెనర్ డిక్వెల్లా (1) ఫీల్డర్ సిరాజ్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కుశాల్ పెరీరా (4) బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నంలో నేరుగా బౌలర్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 14/2తో నిలిచింది.
ఈ దశలో నాలుగో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ మరో ఓపెనర్ ఉపుల్ తరంగ (11: 11 బంతుల్లో 2x4)ని కూడా బోల్తా కొట్టించేశాడు. బంతిని సిక్స్గా తరలించే ప్రయత్నంలో బౌండరీ లైన్కి సమీపంలో ఫీల్డర్ హార్దిక్ పాండ్య చేతికి తరంగ చిక్కాడు. దీంతో వరుసగా మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి శ్రీలంక ఒత్తిడిలో పడింది. అనంతరం వచ్చిన సమరవిక్రమ (21: 17 బంతుల్లో 3x4) కాసేపు నిలకడగా ఆడినట్లు కనిపించినా.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య.. అతడ్ని పెవిలియన్కి పంపడంతో లంక 8.3 ఓవర్లు ముగిసే సమయానికి 56/4తో నిలిచింది.
ఈ దశలో నాలుగో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ మరో ఓపెనర్ ఉపుల్ తరంగ (11: 11 బంతుల్లో 2x4)ని కూడా బోల్తా కొట్టించేశాడు. బంతిని సిక్స్గా తరలించే ప్రయత్నంలో బౌండరీ లైన్కి సమీపంలో ఫీల్డర్ హార్దిక్ పాండ్య చేతికి తరంగ చిక్కాడు. దీంతో వరుసగా మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి శ్రీలంక ఒత్తిడిలో పడింది. అనంతరం వచ్చిన సమరవిక్రమ (21: 17 బంతుల్లో 3x4) కాసేపు నిలకడగా ఆడినట్లు కనిపించినా.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య.. అతడ్ని పెవిలియన్కి పంపడంతో లంక 8.3 ఓవర్లు ముగిసే సమయానికి 56/4తో నిలిచింది.