యాప్నగరం

డబుల్ సెంచరీతో లారాను దాటేసిన కోహ్లీ!

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు.

TNN 3 Dec 2017, 11:10 am
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు సాధించిన కోహ్లీ.. మూడో టెస్టులోనూ డబుల్ సెంచరీ బాదేశాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 238 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది ఆరో డబుల్ సెంచరీ. ఈ ఏడాది మూడోది. 2016 వరకు టెస్టుల్లో ఒక్క డబుల్ సెంచరీ కూడా సాధించని కోహ్లీ.. ఈ రెండేళ్లలోనే ఆరు ద్విశతకాలు బాదడం విశేషం. మొత్తానికి బ్యాట్స్‌మన్ దూకుడుతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.
Samayam Telugu india vs sri lanka 3rd test virat kohli hits another double ton
డబుల్ సెంచరీతో లారాను దాటేసిన కోహ్లీ!


371/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. తొలిరోజు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న కెప్టెన్ కోహ్లీ.. రెండో రోజూ అదే దూకుడును కొనసాగించాడు. అతనికి రోహిత్ శర్మ చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి 110 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 459 పరుగులు చేసింది. భారత్ భారీ స్కోరు సాధించి బౌలింగ్‌లోనూ రాణిస్తే లంక మరో పరాజయానికి సిద్ధమైనట్లే. ప్రస్తుతం కోహ్లి 207 (243 బంతులు; 21 ఫోర్లు), రోహిత్ శర్మ 41 (78 బంతులు; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో ఆడుతున్నారు.

డబుల్స్ కెప్టెన్
కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు (6) సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డుకెక్కాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (5) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే భారత్‌ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ చెరో ఆరు డబుల్ సెంచరీలు సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.