యాప్నగరం

భారత్‌తో టీ20 సిరీస్.. మలింగపై వేటు

భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. అయితే.. ఆశ్చర్యకరంగా

TNN 16 Dec 2017, 3:29 pm
భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. అయితే.. ఆశ్చర్యకరంగా
Samayam Telugu india vs sri lanka lasith malinga left out of t20 squad lakmal rested
భారత్‌తో టీ20 సిరీస్.. మలింగపై వేటు

ఈ జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల మలింగకి మాత్రం చోటు దక్కలేదు. ఆటగాళ్ల ఫిటెనెస్‌పై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖర ఈ జట్టుకి తుది ఆమోదం తెలిపినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత్‌‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకి దూరంగా ఉన్న మలింగ‌కి టీ20 సిరీస్‌ నుంచి కూడా విశ్రాంతినిచ్చినట్లు సెలక్టర్లు తెలిపారు. కానీ.. మూడు రోజుల క్రితం ముగిసిన బంగ్లాదేశ్‌ ప్రీమియర్ లీగ్‌లో మలింగ ఆడటం కొసమెరుపు.

భారత్‌తో తొలి వన్డేలో అద్భుతమైన గణాంకాలతో అదరగొట్టిన ఫాస్ట్ బౌలర్ సురంగ లక్మల్‌తో పాటు లాహిరు తిరిమానెకి టీ20 జట్టు నుంచి విశ్రాంతినివ్వగా.. వారి స్థానంలో విశ్వ ఫెర్నాండో, దసున్ శనక జట్టులోకి వచ్చారు. సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌ కటక్ వేదికగా డిసెంబరు 20న జరగనుంది.

శ్రీలంక జట్టు : తిసార పెరీరా (కెప్టెన్), ఉపుల్ తరంగ, మాథ్యూస్, కుశాల్ పెరీరా, గుణతిలక, డిక్వెల్లా, గుణరత్నె, సమరవిక్రమ, శనక, చతురంగ డిసిల్వా, పతిరన, ధనుంజయ డిసిల్వా, నువాన్ ప్రదీప్, విశ్వ, చమీర

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.