యాప్నగరం

హైదరాబాదీ సిరాజ్‌కి ఇక చోటు కష్టమే..?

భారత్ జట్టులో ఇటీవల చోటు దక్కించుకున్న హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్.. శ్రీలంకతో ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ

TNN 25 Dec 2017, 8:03 pm
భారత్ జట్టులో ఇటీవల చోటు దక్కించుకున్న హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్.. శ్రీలంకతో ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో లయ తప్పిన సిరాజ్ బౌలింగ్‌లో లంక 18 పరుగులు పిండుకుంది. ఆ జట్టు అత్యధిక పరుగులు రాబట్టింది ఈ ఓవర్‌లోనే కావడం విశేషం.
Samayam Telugu india vs sri lanka mohammed siraj has potential but expensive returns show he is not a finished product yet
హైదరాబాదీ సిరాజ్‌కి ఇక చోటు కష్టమే..?


మూడు టీ20ల సిరీస్‌ అప్పటికే చేజిక్కించడంతో చివరి టీ20లో జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో సిరాజ్‌కి తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు వేసి 5.50 ఎకానమీతో 22 పరుగులు ఇవ్వగా.. సిరాజ్ ఎకానమీ 11.25 కావడం కొసమెరుపు. జట్టులోని మిగతా బౌలర్లు జయదేవ్ ఉనద్కత్ (3.75 ఎకానమీ), హార్దిక్ పాండ్య (6.25), కుల్దీప్ యాదవ్ (6.50)తో పోలిస్తే.. సిరాజ్‌ ఎకానమీ దాదాపు రెట్టింపుగా ఉండటంతో మళ్లీ టీ20 జట్టులో అతనికి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ తీసింది ఒక వికెటే కావడం, జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అతని అవకాశాలు మరింత సన్నగిల్లనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.