యాప్నగరం

విరాట్‌కు రెస్ట్.. రోహిత్‌కు కెప్టెన్సీ

శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు సెలక్టర్లు టీమ్‌ను ఎంపిక చేశారు.

TNN 27 Nov 2017, 5:35 pm
శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు సెలక్టర్లు టీమ్‌ను సోమవారం (నవంబర్ 27) సాయంత్రం ప్రకటించారు. వన్డే సిరీస్‌కు కోహ్లి అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. మిగతా టీమ్‌లో పెద్దగా మార్పులు లేవు. మూడో టెస్ట్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో శిఖర్ ధావన్ తిరిగొచ్చాడు. విజయ్ శంకర్‌ను కూడా టీమ్‌లో కొనసాగిస్తూనే.. సిద్ధార్థ్ కౌల్‌కు కొత్తగా జట్టులో అవకాశం ఇచ్చారు.
Samayam Telugu india vs sri lanka virat kohli rested for odi series rohit sharma named captain
విరాట్‌కు రెస్ట్.. రోహిత్‌కు కెప్టెన్సీ

#TeamIndia for the three-match ODI series against Sri Lanka announced #INDvSL Rohit (capt), Shikhar, Ajinkya, Shreyas, Manish, Kedar, Dinesh, MS Dhoni (wk), Hardik, Axar, Kuldeep, Chahal, Bumrah, Bhuvneshwar, Sidharth Kaul pic.twitter.com/w4GWP9weCa — BCCI (@BCCI) November 27, 2017
తనకు విశ్రాంతి కావాలని అనిపించినప్పుడు కచ్చితంగా బీసీసీఐని అడుగుతానని విరాట్ కోహ్లీ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన విరాట్.. తానేమీ రోబోను కాదని, తన చర్మం, మెడను కోస్తే రక్తమే వస్తుందని వ్యాఖ్యానించాడు.

‘ఆటగాళ్లంతా ఏడాదికి 40 మ్యాచ్‌లు ఆడతారు. ఒక్కో ఆటగాడి ఆట ఒక్కో విధంగా ఉంటుంది. క్రీజులో నిలిచే సమయం, వేసే ఓవర్ల సంఖ్య అందరికీ ఒకేలా ఉండదు. టెస్టుల్లో పుజారా లాంటి ఆటగాళ్లు ఎక్కువ గంటల పాటు క్రీజులోనే ఉంటారు. అటాకింగ్ గేమ్ ఆడే వారిని పుజారాతో ఎలా పోలుస్తాం. మైదానంలో ఎక్కువగా కష్టపడేవారికి కచ్చితంగా రెస్ట్ అవసరం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా.. అందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం 20 నుంచి 25 మంది ఆటగాళ్లతో కూడిన స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉందని, దీంతో ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని కోహ్లీ అన్నాడు. విరాట్ కోరిక మేరకు సెలక్టర్లు ప్రస్తుతం అతడికి విశ్రాంతి ఇచ్చారు.
#TeamIndia for the 3rd and final Test against Sri Lanka announced #INDvSL Virat (Capt), Vijay, Rahul, Shikhar, Pujara, Rahane (vc) , Rohit, Saha (wk), Ashwin, Jadeja, Kuldeep, Shami, Umesh, Ishant, Vijay Shankar pic.twitter.com/8hgxfTtMXU — BCCI (@BCCI) November 27, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.