యాప్నగరం

ధోనీలా ఎదగాలని ఉంది: కృనాల్ పాండ్య‌

మహేంద్రసింగ్ ధోనీతో కేవలం ఆరు రోజులు మాత్రమే కలిసి ఉండే అవకాశం అప్పట్లో (ఇంగ్లాండ్ గడ్డపై) నాకు దక్కింది.

Samayam Telugu 2 Nov 2018, 1:16 pm
భారత్ జట్టులో ధోనీలా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు యువ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. అందులో కృనాల్ పాండ్య‌ాకి చోటిచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu india vs west indies 1st t20 i want to be like ms dhoni says krunal pandya
ధోనీలా ఎదగాలని ఉంది: కృనాల్ పాండ్య‌


ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌కి కూడా అప్పట్లో సెలక్టర్లు అతడ్ని ఎంపిక చేశారు. కానీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండటంతో కృనాల్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు అతను గాయపడటంతో.. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌లో కృనాల్ పాండ్య‌ాకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతున్న కృనాల్ పాండ్య‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మహేంద్రసింగ్ ధోనీతో కేవలం ఆరు రోజులు మాత్రమే కలిసి ఉండే అవకాశం అప్పట్లో (ఇంగ్లాండ్ గడ్డపై) నాకు దక్కింది. ఆ సమయంలో అతని నిరాడంబరత, ఒదిగి ఉండేతత్వం నన్ను ఆకట్టుకున్నాయి. గొప్ప విజయాలు సాధించినా.. అందరితోనూ అతను సింపుల్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. ధోనీలా ఎదగాలి, ఉండాలని’ అని కృనాల్ పాండ్య‌ా వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.